Divitimedia
Andhra PradeshBhadradri KothagudemHealthHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelangana

డాక్టర్ విజేందర్రావుకు రోటరీ నేతల ఘన నివాళి

డాక్టర్ విజేందర్రావుకు రోటరీ నేతల ఘన నివాళి

✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 12)

కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు, రోటరీ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ డాక్టర్.విజేందర్ రావు మృతికి రోటరీ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్లు, పలువురు ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన పార్థివ దేహం వద్ద ఘనంగా నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య, సేవారంగాల్లో డాక్టర్.విజేందర్ రావు సేవలను స్మరించుకుని, కొనియాడారు. ఆయనకు నివాళులర్పించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్-3150 మాజీ గవర్నర్లు డా.బుూసిరెడ్డి శంకర్ రెడ్డి, డీకే ఆనంద్, జామున్లమూడి అబ్రహం, రోటరీక్లబ్ ప్రతినిధులు హరిహరప్రసాద్, గుడికందుల నాగేశ్వరరావు, వీసం వసంతరావు తదితరులున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజకీయ బల్క్ ‘ఎస్ఎంఎస్’ లపై 27వ తేదీ వరకు నిషేధం

Divitimedia

తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

Divitimedia

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

Leave a Comment