కృష్ణసాగర్ ఐటీఐలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ లోని ప్రభుత్వ ఐటీఐలో మంగళవారం సిబ్బంది,
విద్యార్థులు శ్రమదానం, గార్డెనింగ్, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. క్యాంపస్ లో పరిసరాల పరిశుభ్రత, హాస్టల్ ఆవరణలో, కార్యాలయం, వర్కుషాపులన్నింటినీ శుభ్రం చేశారు. ప్రధాన గేట్, కార్యాలయం బోర్డును నవీనీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్, కార్యాలయ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip:

