Divitimedia
Bhadradri KothagudemLife StyleTelangana

ఐటీడీఏ పీఓను కలిసిన పద్మశ్రీ రామచంద్రయ్య

ఐటీడీఏ పీఓను కలిసిన పద్మశ్రీ రామచంద్రయ్య

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

ప్రముఖ డోలీ కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకినం రామచంద్రయ్య శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన పీఓకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు తీసుకున్న సకినం రామచంద్రయ్యను అభినందించిన ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు అంతరించకుండా, వాటిని కాపాడుకుంటూ పద్మశ్రీ అవార్డు పొందడం చాలా సంతోషకరమన్నారు. కళలను నేటి తరానికి అందించాలని, గిరిజన సంస్కృతి కాపాడాలని, తప్పకుండా ఆయన సేవలను నేటితరానికి అందించే విధంగా సహకారం అందించి కృషిచేస్తామన్నారు.కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, ట్రైబల్ మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, తదితరులు కూడా పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్

Divitimedia

ప్రభుత్వవిప్ శ్రీనివాస్ ను కలిసిన కార్మికనాయకులు

Divitimedia

నేడు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రోజ్ గార్ మేళా’

Divitimedia

Leave a Comment